న్యూఢిల్లీ: హాల్మార్క్ గుర్తింపులేని బంగారు ఆభరణాల నాణ్యతను ఇకపై వినియోగదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఏహెచ్సీ (అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్స్) కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవచ్చు. నాలుగు ఆభరణాల వరకు రూ.200 చార్జీ వసూలు చేస్తారు. ఐదు అంతకంటే ఎక్కువ ఉంటే ఒక్కో దానికి రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.