అయోధ్య: అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రంజాన్ మాసం వచ్చే మే నెలలో మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు హజి అర్ఫత్ షేక్ వెల్లడించారు. మహ్మద్ ప్రవక్త పేరున ఈ మసీదుకు ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు’ అని నామకరణం చేశారు. అయోధ్య రామజన్మభూమి విదాదం కేసులో సుప్రీంకోర్టు కొత్త మసీదు కోసం బాబ్రీ మసీదు కూల్చిన స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో స్థలాన్ని కేటాయించింది.