ముంబై: రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగి ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. శనివారం ముంబైలో ఆయన నానీ ఎ పాల్కీవాలా స్మారకోపన్యాసం చేశారు. మనం పయనించాల్సిన దారి సంక్లిష్టమైనదైనప్పుడు రాజ్యాంగ వ్యాఖ్యాతలకు, కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగ మూల నిర్మాణం కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు అందించిందన్నారు. ఇటీవల భారత న్యాయవ్యవస్థ చెప్పుకోదగ్గ మార్పులకు లోనైందని, వాణిజ్య లావాదేవీలకు మద్దతు పలకడంలో చురుగ్గా పని చేస్తున్నదని వెల్లడించారు.