కాంగ్రెస్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1988 లో జరిగిన రోడ్ రేజ్ కేసులో ఈ శిక్ష పడింది.గుర్నామ్ సింగ్ అనే వ్యక్తికి, సిద్దూకి మధ్య గొడవ జరిగింది.
మొదట్లో ఈ గొడవ చిన్నదే అయినా… తర్వాత పెద్దదిగా మారిపోయింది. సిద్దూ గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని లాగి కొట్టారు. దీంతో గుర్నామ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసులో సిద్దూకు కింది కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. బాధిత కుటుంబం పై కోర్టుల్లో అప్పీల్ చేసుకుంది. చివరకు 30 ఏళ్ల క్రితం నాటి కేసులో సుప్రీం కోర్టు నేడు సిద్దూకు యేడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.