వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఈ చర్చ జరిగింది. అంతేకాకుండా ప్రశాంత్ కిశోర్ 2024 సార్వత్రిక ఎన్నికలపైనే సుదీర్ఘమైన ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఓ రోడ్ మ్యాప్ను కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలపై వీరందరూ గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా (వన్ టూ వన్) కూడా ఇదే అంశంపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రెజెంటేషన్పై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ వారంలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
కాంగ్రెస్లో చేరిపోండి… పీకేను కాంగ్రెస్ కాంగ్రెస్ అగ్రనేతలు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. 2024 ఎన్నికలపై ఓ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిపోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు పీకేని కోరినట్లు తెలుస్తోంది. కేవలం పార్టీ సలహాదారుగా కాకుండా, కాంగ్రెస్లో చేరిపోవాలని కోరినట్లు సమాచారం. అయితే.. పీకే మాత్రం ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది.