న్యూఢిల్లీ, మే 20: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడిగా కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై సీబీఐ శనివారం ఢిల్లీ రౌస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో తాజా ఆధారాలు లభ్యం కావడంతో ఆయన పేరును చార్జిషీట్లో చేర్చారు.
ఢిల్లీలోని పూల్ బంగాష్ ప్రాంతంలోని గురుద్వార సమీపంలో నవంబర్ 1, 1984లో జరిగిన అల్లర్లలో ఒక మూకను టైట్లర్ రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి.