న్యూఢిల్లీ: త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలిచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నేపథ్యంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు.. పార్టీ హై కమాండ్ తీరును ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తున్నది. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మీడియాకు చెప్పారు.
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో అధి నాయకత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కపిల్ సిబాల్ ఇదే అంశాన్ని లేవనెత్తినందుకు కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. దీనిపై జీ-23 నేతలు అభ్యంతరం తెలిపారు. తక్షణం సీడబ్ల్యూసీ ఏర్పాటు చేయాలని గులాం నబీ ఆజాద్, చిదంబరం తదితరులు డిమాండ్ చేశారు.