న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుప్రియా శ్రీనేత్ అభ్యంతరకర పోస్ట్ చేయడం దుమారం రేపింది. దీనిపై కంగన మండిపడ్డారు. ‘20 ఏండ్లలో అనేక పాత్రల్లో నటించాను. మహిళలను దురభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలి. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళా తన గౌరవానికి అర్హురాలు’ అని కంగన పేర్కొన్నారు. అయితే తన ఫేస్బుక్ ఖాతా యాక్సెస్ చాలా మంది దగ్గర ఉన్నదని, ఆ పోస్ట్ తాను చేయలేదని సుప్రియ పేర్కొన్నారు. సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఎన్సీడబ్ల్యూ లేఖ రాయనున్నది.