పనాజీ: గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ (Congress) పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. తాము 12 స్థానాల్లో, బీజేపీ 18 సీట్లలో గెలుపొందింది. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించేందుకు కష్టపడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
గోవాలో 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీకి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలికారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.