జైపూర్: రాజస్థాన్లో 2023లోనూ తమదే విజయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇవాళ క్యాబినెట్ విస్తరణలో భాగంగా 15 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అశోక్గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని.. సోనియాగాంధీ, రాహుల్గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి విజయం సాధించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధే తమను మళ్లీ గెలిపిస్తుందన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తమకే పట్టంకట్టారని పేర్కొన్నారు. తమ పరిపాలనా విధానాలకు ప్రజలు ఆమోదముద్ర వేశారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు.