న్యూఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది.
శనివారం (సెప్టెంబర్ 24) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించనున్నారు.
వచ్చేనెల 19న ఫలితాలను ప్రకటిస్తారు. కాగా, అధ్యక్ష పదవికి ఎవరు పోటీచేస్తున్నారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ పడనున్నారని తెలుస్తున్నది.
1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండటం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఎన్నికల ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడిగా సీతారాం కేసరి ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవినీ స్వీకరించడానికి రాహుల్ గాంధీ ఒప్పుకోకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.