న్యూఢిల్లీ : అలీఘఢ్ పేరును హరిఘఢ్గా మార్చేందుకు యూపీలోని యోగి ఆదిత్యానాధ్ సర్కార్ యోచిస్తున్న క్రమంలో పేర్ల మార్పు వ్యవహారంలో కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక నిరుద్యోగం పేరును ఉద్యోగంగా మార్చడమే మిగిలిఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ డాక్టర్ అజయ్ కుమార్ బీజేపీ తీరును తప్పుపట్టారు.
నిరుద్యోగం పేరును కూడా ఎంప్లాయ్మెంట్గా మార్చేస్తే దేశ సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీకి ఆయన చురకలు వేశారు. కాగా అలీఘఢ్ నగరం పేరును హరిఘఢ్గా మార్చాలని జిల్లా పంచాయతీ తీర్మానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్పీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం అసెంబ్లీకి పంపారు.