కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోటీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టం చేసింది. అంతేగాక లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం 42 మంది అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. అయితే బెంగాల్లో టీఎంసీతో పొత్తు ఆశించి భంగపడిన కాంగ్రెస్ దీనిపై స్పందించింది. (Congress on TMC) టీఎంసీకి ఎలాంటి ఒత్తిడి ఉందో తెలియడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బెంగాల్లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉండాలని తాము ఎల్లప్పుడూ కోరుకుంటున్నామని పేర్కొంది. ‘అలాంటి ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతోంది. ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదు. బీజేపీపై ఇండియా బ్లాక్ కలిసి పోరాడాలని కాంగ్రెస్ కోరుకుంటోంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో, తమిళనాడులోని డీఎంకేతో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసుకుంది. జమ్ముకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), మహారాష్ట్రలో ఎంవీఏ కూటమితో ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నది.
The Indian National Congress has repeatedly declared its desire to have a respectable seat-sharing agreement with the TMC in West Bengal. The Indian National Congress has always maintained that such an agreement has to be finalised through negotiations and not by unilateral…
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2024