భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ను బీజేపీ ఎంపిక చేసిన అనంతరం కాషాయ పార్టీ నిర్ణయంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఉజ్జయిని మాస్టర్ ప్లాన్లో భారీ అవకతవకలు సహా యాదవ్పై పలు తీవ్ర ఆరోపణలున్నాయని కాంగ్రెస్ ఆక్షేపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ట్విట్టర్ వేదికగా మోహన్ యాదవ్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
మధ్యప్రదేశ్కు ఇదేనా మోదీ గ్యారంటీ అని ఆయన విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన 8 రోజుల తర్వాత ఉజ్జయిని మాస్టర్ ప్లాన్లో అక్రమాలు సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ యాదవ్ను సీఎంగా ఎంపిక చేశారని జైరాం రమేష్ దుయ్యబట్టారు. యాదవ్కు లబ్ధి చేకూర్చేందుకు ఉజ్జయిని మాస్టర్ ప్లాన్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టిందని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు నవంబర్లో సింహస్ధ మేళాలో వాడేందుకు ఉద్దేశించిన భూమిని యాదవ్కు లబ్ధి చేకూర్చేలా భూమి ఉపయోగాన్ని వ్యవసాయం నుంచి నివాస యోగ్యానికి మార్చారని దుయ్యబట్టారు. ఆ ప్రాంతంలో యాదవ్, ఆయన భార్య, సోదరికి భూములున్నాయని అన్నారు. మోహన్ యాదవ్ దుందుడుకుగా వ్యవహరిస్తూ అభ్యంతరకర ప్రకటనలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, మధ్యప్రదేశ్కు మోదీ గ్యారంటీ ఇదేనా అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
Read More :