జీ 23 అసంతృప్త నేతలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ మాత్రమే హాజరయ్యారు. మరో సారి కూడా ఈ సమావేశాన్ని సోనియా నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల్లో జీ 23 గ్రూపుకు చెందిన నేతలందరితో సమావేశం కావాలని సోనియా నిర్ణయించుకున్నారు. పార్టీ పటిష్ఠత, పార్టీ నిర్మాణంతో పాటు పార్టీతో వీరికి ఏర్పడ్డ గ్యాప్ను కూడా పూరించడంపై సోనియా వీరితో చర్చించారు.
జీ 23 గ్రూపుకు చెందిన నేతలతో సోనియా గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితమే జీ 23 గ్రూపులో కీలక వ్యక్తి అయిన గులాంనబీ ఆజాద్తో సోనియా భేటీ అయ్యారు. పార్టీ పటిష్ఠతపై ఇరువురూ చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని తామెన్నడూ ప్రశ్నించలేదని, కాంగ్రెస్కు ఒకరే అధ్యక్షులు ఉంటారని ఆజాద్ పేర్కొన్నారు.