న్యూఢిల్లీ: అధ్యక్ష ఎన్నికల నిర్వహణతో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ మొదలైనట్లేనని తాను అనుకుంటున్నానని సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఇవాళ పోలింగ్ జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున్ ఖర్గేతో ఆయన పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మాత్రం కార్యకర్తల చేతుల్లోకి వచ్చిందని థరూర్ వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం తాను ఖర్గేకు ఫోన్ చేశానని, ఇవాళ్టి ఎన్నికల్లో ఎవరు గెలిచినా తర్వాత మాత్రం మనం స్నేహితులం, సహచరులమేనని చెప్పానని శశిథరూర్ తెలిపారు. కాగా, ఖర్గే సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అధ్యక్ష ఎన్నికలు తమ పార్టీ అంతర్గత ఎన్నికలని చెప్పారు. ఎన్నికల్లో ఎవరం గెలిచినా దాన్ని స్నేహపూర్వకంగానే అంగీకరిస్తామని, కలిసిమెలిసి పార్టీని అభివృద్ధి చేస్తామని అన్నారు.
శశిథరూర్ ఈ ఉదయం తనకు ఫోన్ చేసి మాట్లాడారని, ఇవాళ పోలింగ్ నేపథ్యంలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారని ఖర్గే వెల్లడించారు. తాను కూడా ఖర్గేకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పానని అన్నారు.