ముంబై: మహారాష్ట్రలోని మహా వికాశ్ అగాధీ కూటమి సీట్ల షేరింగ్పై డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలుబడే ఛాన్సు ఉన్నది. మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress party)18, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వంచిత్ బహుజన్ అగాధి పార్టీకి రెండు సీట్లు కేటాయించారు. సీట్ల పంపకం విషయంలో పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.