Unnao | ఉత్తరప్రదేశ్లో పూర్వ వైభవం చాటుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని అభ్యర్థిగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 125 మందితో కూడిన తొలి విడత జాబితాను పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ విడుదల చేశారు. ఇందులో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ కూడా ఉన్నారు.
ప్రియాంక ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది (40 శాతం) మహిళా అభ్యర్థులు, మరో 40 శాతం మంది యువత ఉన్నారు. వీరిలో ఆశా కార్యకర్త పూనమ్ పాండే, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ కూడా ఉన్నారు.
2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ దోశిగా తేలారు. దీంతో 2020లో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ అమానుష ఘటనపై పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంటి ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఈ కేసు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్పై అత్యాచార ఆరోపణలు రావడంతో, బాధితురాలి తండ్రిని అక్రమాయుధాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో చిత్రహింసలు పెట్టడంతో ఆయన మరణించారు.