ముంబై: లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా చెయ్యిని వదిలేస్తున్నారు. అశోక్ చవాన్, మిలింద్ దేవరా వంటి ప్రముఖ నాయకులు ఇప్పటికే తమదారి తాము చూసుకున్నారు. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ (Gourav Vallabh) కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆయన తన లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళ్తుంతో కూడా తెలియడం లేదని, క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిన్నదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళుతోందో కూడా తెలియడంలేదని, అది నాకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను నిందించలేనని తెలిపారు. తాను పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బాగా దెబ్బతిన్నదని చెప్పారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ను పూరించడం కష్టంగా మారిందని వెల్లడించారు. కిందిస్థాయిలోని వారు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదన్నారు.
2023లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ్ ఓడిపోయారు. ఉదయ్పూర్ నియోజకవర్గంలో ఆయనపై బీజేపీ అభ్యర్థి 32 వేల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో జార్ఖండ్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. జెంషెడ్పూర్ ఈస్ట్ స్థానం నుంచి బరికలోకి దిగిన ఆయన 18 వేల ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.