న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడంపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంపై తీవ్రంగా రాజ్యసభ చైర్మన్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రివిలిజేస్ కమిటీ విచారిస్తుందని, సభ పరిశీలనకు ప్రివిలేజెస్ కమిటీ నివేదిక సమర్పించే వరకు రజనీ పాటిల్ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రజనీ పాటిల్ స్పందిస్తూ తాను అలాంటివేమీ చేయలేదరని, అయినా నాకు ‘ఉరిశిక్ష’ విధించారన్నారు. తాను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, చట్టాలను ఉల్లంఘించడానికి మా సంస్కృతి నన్ను అనుమతించదని చెప్పారు. నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తుండగా.. అడ్డుకున్నామని, అందుకే ఆగ్రహంతో ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ ప్రతిష్టాత్మకమైన సభలో పార్లమెంట్లోని సీనియర్ సభ్యులు అనధికారికంగా రికార్డు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలు చూడాల్సి వస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.