న్యూఢిల్లీ: సభా కార్యక్రమాలను రికార్డు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్రావ్ పాటిల్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. చెడ్డ ప్రవర్తన కారణంగా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించడంతోపాటు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీతో దర్యాప్తు చేయిస్తామన్నారు.
కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దీనిపై శుక్రవారం స్పందించారు. ఇది అనారోగ్యకరమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగతా బడ్జెట్ సమావేశాల వరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
In public domain y'day, on Twitter,there was dissemination of a video relating to proceedings of this House. I took a serious view of it&did all that was required. As a matter of principle&to keep sanctity of Parliament,no outside agency's involvement could be sought: RS Chairman pic.twitter.com/LMYrEJLHZ6
— ANI (@ANI) February 10, 2023