Karnataka | కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 2018 మేనిఫెస్టో హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను శుక్రవారం విధాన సౌధలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెవిలో పూలు పెట్టుకుని అక్కడ ప్రత్యక్షమయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు నేతలు చెవిలో పూలు పెట్టుకుని సమావేశాల్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Bengaluru | LoP & former CM Siddaramaiah and other Congress leaders in Karnataka Assembly during Budget presentation wear flowers on their ears alleging that BJP govt has cheated people by not fulfilling promises from previous budget & the promises made in 2018 manifesto pic.twitter.com/zDgY8NltOV
— ANI (@ANI) February 17, 2023