భోపాల్, జూన్ 10: హనుమంతుడు గిరిజనుడే.. అంటూ మధ్యప్రదేశ్లోని గంధ్వానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘హనుమంతుడు ఆదివాసీ. శ్రీరాముడ్ని లంకకు చేర్చింది హనుమే. మనమంతా ఆయన వారసులం. ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుందాం’ అని చెప్పుకొచ్చారు.
దీనికంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోదియా కూడా ‘శివుడు, హనుమంతుడు గిరిజనులు. శివుడు హాలాహలాన్ని సేవించి ప్రపంచాన్ని కాపాడిన దేవుడు. క్షత్రియులు, అయోధ్య వాసులు ఎవ్వరూ శ్రీరాముడికి సాయం చేయలేదు. క్లిష్ట సమయంలో గిరిజనులు అంతా ఆయన వెంట నిలబడ్డారు’ అని వ్యాఖ్యానించారు.