గోవాపై పూర్తి దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్ఠానం.గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ ప్రయత్నాలు ప్రారంభించారు.
చిన్న పార్టీలు, స్వతంత్రులతో ఇప్పటి నుంచే మంతనాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు ఆమ్ఆద్మీ పార్టీ, తృణమూల్తో కూడా వీరిద్దరూ మంతనాలను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమ్ఆద్మీ గోవా సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ ధ్రువీకరించారు కూడా. అయితే కాంగ్రెస్తో కలవడానికి ఆప్ ఓకే చెప్పింది. తృణమూల్ మాత్రం ఇంకా స్పందించలేదు.
ఇదే విషయంపై గోవా ఆప్ సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు కొందరు తమను సంప్రదించిన మాట వాస్తవం. బీజేపీయేతర కూటమి ఏదైనా మేం రెడీ. బీజేపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తి ఉండదు అని అమిత్ పాలేకర్ ప్రకటించారు.