ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వీర్ సావర్కర్ గురించి రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకులు కూడా వీర్ సావర్కర్ గురించి ఆయన (రాహుల్గాంధీ) చేసిన వ్యాఖ్యలను సమ్మతించరని రౌత్ చెప్పారు. బీజేపీ సర్కారు నియంతృత్వ ధోరణిపైన, నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అంశాలకు వ్యతిరేకంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, వాటి గురించి మాత్రమే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభిస్తుందని వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా వీర్ సావర్కర్ బ్రిటిషర్లకు సహకరించాడని, గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధులను ఆయన మోసం చేశాడని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆనాడు బ్రిటిషర్స్కు వీర్ సావర్కర్ రాసిన లేఖను కూడా రాహుల్గాంధీ మీడియాకు చూపించారు.