తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కేరళ వెళ్లారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తన పార్లమెంట్ నియోజకవర్గమైన వాయనాడ్లో రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. వాయనాడ్లోని తన కార్యాలయానికి ఆయన వెళ్లారు. జూన్ 24న ఎస్ఎఫ్ఐ ధ్వంసం చేసిన తన కార్యాలయాన్ని రాహుల్ గాంధీ పరిశీలించారు. ఈ ఘటన దురదృష్టకరం, బాధ్యతారహితమని విమర్శించారు. హింస ఎప్పుడూ కూడా సమస్యలను పరిష్కరించదన్నారు. ‘ఇది వాయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలా జరుగడం దురదృష్టకరం. హింస ఎప్పుడూ సమస్యలను పరిష్కరించదు. ఇలా చేసిన వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వారి పట్ల నాకు ఎలాంటి శత్రుత్వం లేదు’ అని అన్నారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం తన నియోజకవర్గమైన వాయనాడ్కు వచ్చారు
కాగా, అటవీ ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ వరకు బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై స్థానిక ఎంపీ అయిన రాహుల్ గాంధీ చర్యలు తీసుకోలేదంటూ ఎస్ఎఫ్ఐ ఆగ్రహించింది. జూన్ 24న ఎస్ఎఫ్ఐకు చెందిన 70 మందికిపైగా యవకులు రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయంలోకి బలవతంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేయడంతోపాటు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కార్యాలయం కార్యదర్శి అగస్టిన్ పుల్పల్లి తీవ్రంగా గాయపడినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పనిగా ఆరోపించింది.
#WATCH | Congress leader Rahul Gandhi holds a roadshow in Wayanad, Kerala pic.twitter.com/vCjzaISy95
— ANI (@ANI) July 1, 2022