Rahul Gandhi | పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసింది. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ బయోలో (Twitter bio) మార్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, డిస్క్వాలిఫైడ్ ఎంపీగా (Dis’Qualified MP) పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో ట్రెడింగ్ అవుతున్నది.
‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని కోర్టు దోషిగా ప్రకటించింది. తీర్పు చెప్పిన తేదీ (23 మార్చి, 2023) నుంచి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నాం’ అని లోక్సభ సచివాలయం నోటిఫికేషన్లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం.. ఆర్టికల్ 102(1)(ఈ)లోని నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియట్ వెల్లడించింది. అయితే 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
'संकल्प सत्याग्रह' में शामिल होने के लिए राजघाट पहुंची @priyankagandhi जी। pic.twitter.com/20IseQKNwJ
— Congress (@INCIndia) March 26, 2023