న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ చౌదరి పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ సహాయంతోనే మమత గతంలో కేంద్ర మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఈ సంగతిని ఆమె మరిచిపోయారని విమర్శించారు. మమతా బెనర్జీ గోవాలో బీజేపీకి దారి చూపిస్తున్నారని, పరోక్షంగా ఆ పార్టీకి ఆమె మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందని అన్నారు. అందుకే గోవాలో కాంగ్రెస్ రాణించదని మమత భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.