కొట్టాయం: మతతత్వంపై కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం కొట్టాయంలో విజయన్ మాట్లాడుతూ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయన్నారు. కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం భాగస్వామ్య పక్షాలుగా ఉండటం గమనార్హం.