Congress : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోయింది. దీనిపై జీ 23 సభ్యులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా వున్న వారి మధ్య నిట్ట నిలువునా చీలిక వచ్చింది. జీ 23 సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఆజాద్కు పద్మ భూషణ్ రావడాన్ని బహిరంగంగానే స్వాగతించారు. గులాంనబీ ఆజాద్కు ధన్యవాదాలు. ప్రజాసేవకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయన జీవిత కాలం సేవ చేశారు. ఆజాద్కు ధన్యవాదాలు అంటూ ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.
ఇక కాంగ్రెస్ మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ కూడా స్పందించారు. పద్మభూషణ్ దక్కడానికి గులాంనబీ ఆజాద్ పూర్తి అర్హులే. శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్ సేవలు మొత్తం దేశమే గుర్తించిందని, ఇక కాంగ్రెస్కు ఆయన సేవలు అవసరం లేదని వ్యంగ్యంగా సిబాల్ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరు గడించిన జైరాం రమేశ్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందించారు. గులాంనబీ ఆజాద్ గులాంలా కాకుండా ఆజాద్గా వుండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం పద్మ అవార్డు ప్రకటించడం సరైనదేనని, అయితే ఆయన ఆజాద్లా వుండాలని కోరుకుంటున్నారని పరోక్షంగా జైరాం చురకలంటించారు.