ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరా పరాభవం తర్వాత జీ 23 నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 బృందంలో సభ్యుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో వీరందరూ సమావేశమయ్యారు.సీనియర్ నేత కపిల్ సిబాల్, మనీశ్ తివారీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలను చూసి షాక్కు గురయ్యా. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం కోల్పోవడం చూస్తుంటే నా గుండె గుభేల్ మంటోంది అంటూ ఆజాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చూసి షాక్కు గురయ్యా. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నాం. ఇదంతా చూస్తుంటే గుండె గుభేల్ మంటోంది. యవ్వనం నుంచి వయస్సునంతా, జీవితాన్నంతా పార్టీకే ధారపోశాం. లోటుపాట్లను సవరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.