న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ వెల్లడించారు. సోనియా కరోనా పాజిటివ్ నిర్ధారించబడ్డారని జైరాం రమేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీన సోనియా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే సోనియా కోలుకున్నప్పటికీ.. కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె జూన్ 12న ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన విషయం విదితమే.
Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.
आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022