Anantkumar Hegde : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అందించాలని కర్నాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చర్యలు చేపట్టాలని పాలక పార్టీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్రంలో పాలక కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా అంగీకరించలేదని, రాజ్యాంగంపై ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని బీజేపీ పూర్తిగా అంగీకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రధాని చెబుతుండగా, రాజ్యాంగాన్ని మార్చేందుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెప్పాలని తమ పార్టీ సభ్యులను ఆయన కోరుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడంపై సాధారణ వ్యక్తులు మాట్లాడటం లేదని, బీజేపీ ఎంపీలు, ముఖ్య నేతలే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడితే తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని ఖర్గే బీజేపీని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి విశ్వాసం ఉంటే అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి తొలగించాలని, వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు నిరాకరించాలని ఖర్గే కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడే మోదీ తమ పార్టీ నేతలు చేసే అలాంటి వ్యాఖ్యల పట్ల మాత్రం మౌనం దాల్చుతారని కాంగ్రస్ చీఫ్ మండిపడ్డారు.
Read More :
Sea Turtle meat | తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత