న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను ఎన్నుకున్నట్లు తెలిసింది. శనివారం ‘ఇండియా’ బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి అన్న దానిపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్కు చెందిన నేత ఒకరు కూటమి కన్వీనర్ పదవిని చేపట్టాలని రేస్లో ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారు. దీంతో ‘ఇండియా’ బ్లాక్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.
కాగా, శనివారం నాటి వర్చువల్ సమావేశంలో పలు అంశాలపై కూటమి నేతలు చర్చించారు. ప్రధానంగా త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. అలాగే జనవరి 14న మణిపూర్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర, ప్రతిపక్షాలు అందులో పాల్గొనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
#WATCH | Tamil Nadu CM & DMK leader MK Stalin and party leader Kanimozhi Karunanidhi attend the meeting of INDIA bloc leaders via video conferencing
The meeting is underway to review seat sharing, participation in Bharat Jodo Nyay Yatra and other issues. pic.twitter.com/AzAFHNfF6b
— ANI (@ANI) January 13, 2024