బెంగళూర్ : మైసూరులో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో కర్నాటకలోని పాలక బీజేపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. బీజేపీ పాలనలో కర్నాటక మరో యూపీలా తయారైందని కాంగ్రెస్ నేతలు బీకే హరిప్రసాద్, రిజ్వాన్ అర్షద్ ఆరోపించారు. సామూహిక లైంగిక దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో మైసూరు పోలీసులు జాప్యం చేశారని అన్నారు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనను రాజకీయం చేయరాదని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేతలు హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ప్రస్తావించారు. దురదృష్టకర ఘటనలను రాజకీయం చేయడం కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఇక విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.