అహ్మదాబాద్ : గుజరాత్ పాత సచివాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన నేపధ్యంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 27 ఏండ్ల అవినీతిని మరుగుపరిచేందుకు ప్రభుత్వ ఫైళ్లను బీజేపీ ప్రభుత్వం దగ్ధం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారం కోల్పోతామనే భయంతో 27 ఏండ్ల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాషాయ ప్రభుత్వం గుజరాత్ ఫైళ్లను తగులబెట్టిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మంటలు రేగిన ఈ భవనం ప్రభుత్వ ఫైళ్లు ఉంచే గుజరాత్ పాత సచివాలయం..ఇది యాధృచ్ఛికంగా జరిగిందా లేకా ప్రయోగమా అని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ప్రశ్నించారు.
27 ఏండ్ల ప్రభుత్వ అవినీతికి సాక్ష్యంగా నిలిచిన గుజరాత్ ఫైల్స్ దగ్ధం కావడం మొదలైందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఆరంభంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.