న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో డీఎంకే కూటమి ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ స్టాలిన్కు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని అన్నారు. మీ నాయకత్వంలో మనం ఆ దిశగా అడుగు వేసి ప్రజల నమ్మకాన్ని నిరూపించగలం, శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో డీఎంకే 156, అన్నాడీఎంకే 78 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టాలిన్తో కలిసి వేదిక కూడా పంచుకున్నారు. దీంతో డీఎంకే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం కానున్నది.