పాట్నా, జూన్ 5: బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం దేశ రాజధానిలో మిత్ర పక్షాలతో సమావేశం నిర్వహించాయి. ఎన్డీయే భేటీకి హాజరయ్యేందుకు నితీశ్, ఇండియా కూటమి భేటీకి వెళ్లేందుకు తేజస్వీ పాట్నా విమానాశ్రయం నుంచి ఒకే విమానంలో బయలుదేరారు. అంతేకాదు, ముందుసీట్లో నితీశ్, ఆయన వెనక సీట్లోనే తేజస్వీ కూర్చోవడం విశేషం. బీహార్లోని 40 లోక్సభ స్థానాలకు ఎన్డీయే కూటమి 12 గెలుచుకుంది. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను సంపాదించుకోలేకపోయిన బీజేపీకి ఇప్పుడు నితీశ్ కీలక వ్యక్తిగా మారారు. ఇక, ఇండియా కూటమిలో భాగమైన ఆర్జేడీ నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ వెళ్లేముందు తేజస్వీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో తమకు స్థానాలు పెరిగాయని, కోటికిపైగా ఓట్లు సొంతం చేసుకున్నట్టు చెప్పారు.