న్యూఢిల్లీ: ప్రతి 2 నెలలకు ఒకసారి దత్తత డ్రైవ్ చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య, దత్తత కోసం రిజిస్టర్ చేసుకొన్న తల్లిదండ్రుల సంఖ్య లో తప్పులు ఉండకూడదని సూచించింది.