CM Shivraj Singh Chouhan | భోపాల్: మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం నూతన వధూవరులకు షాకిచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలలో పెండ్లి కుమార్తెకు అందజేసిన మేకప్ బాక్స్లో కండోమ్లు, గర్భ నిరోధక మాత్రలు దర్శనమిచ్చాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి వివాహం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కన్యా వివాహ్/నిఖా యోజన పథకం కింద సీఎం శివరాజ్సింగ్ నేతృత్వంలో తండ్లాలో 296 జంటలకు సామూహిక వివాహాలను నిర్వహించారు.
అయితే ఈ పథకంలో వధూవరులకు పంచిన గిఫ్ట్ బాక్స్లలో కండోమ్ ప్యాకెట్లు, గర్భ నిరోధక మాత్రలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, వీటి పంపిణీతో తమకేమీ సంబంధం లేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కుటుంబ నియంత్రణపై అవగాహన కోసం మాత్రమే వాటిని అందజేసి ఉంటారని జిల్లా అధికారి రావత్ తెలిపారు.