Assam | గువాహటి: మియా ముస్లింలపై అస్సాం సీఎం హిమంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ ఎంపీ అజిత్ భుయాన్ డిస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎగువ అస్సాంలోని ప్రజలు గువాహటికి తరలివస్తే, గువాహటిలో ఉన్న మియా ముస్లింలను తాను ఖాళీ చేయిస్తానని గతంలో హిమంత చేసిన వ్యాఖ్యలను భుయాన్ ప్రస్తావించారు.
విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా పాలక పక్షాల నాయకులపై ఎలాంటి కేసులు నమోదు కావడం లేదన్నారు. వారిపై ఫిర్యాదు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.