న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వారాల ముందే అంటే ఈ నెల 12 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జరిగే ఉత్సవాల కోసం విధి, విధానాలను రూపొందించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా 259 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.