న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ.51.5 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1580కి తగ్గింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.