వాణిజ్య సిలిండర్పై రూ.105 పెంపు
న్యూఢిల్లీ, మార్చి 1: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.105 పెంచుతున్నట్టు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2,012కి చేరింది. ఇక 5 కేజీల సిలిండర్పై కూడా రూ. 27 పెరగ్గా, ఢిల్లీలో దీని ధర రూ.569గా ఉన్నది. 19 కేజీల సిలిండర్ ధర కోల్కతాలో రూ.2,089, ముంబైలో రూ.1,962, చెన్నైలో రూ.2,185కి పెరిగింది. ఇండ్లలో వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ప్రస్తుతానికి మార్పుల్లేవు.