న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు విదేశాంగ శాఖ ఇవాళ సమన్లు(Diplomat Summoned) జారీ చేసింది. దీంతో ఆమె బుధవారం మధ్యాహ్నం సుమారు 40 నిమిషాల పాటు విదేశాంగ శాఖ ప్రతినిధులను కలిశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అనవసరమైన ఆశయాలతో చేసే వ్యాఖ్యలు అనారోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుందని విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్గత వ్యవహారాలను ఆయా రాష్ట్రాలు గౌరవించాలని, ఇక ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉండాలని, లేదంటే అనారోగ్యకరమైన పరిణామాలకు వ్యవహారం దారి తీస్తుందని విదేశాంగ శాఖ తన వార్నింగ్లో పేర్కొన్నది. భారతీయ న్యాయ ప్రక్రియ అనేది వ్యక్తిగత న్యాయవ్యవస్థకు సంబంధించినదని, దానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనవసరం అని విదేశాంగ శాఖ తెలిపింది.
కేజ్రీవాల్ అరెస్టు విషయాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఆ కేసులో స్వేచ్ఛగా విచారణ చేపట్టాలని మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.