న్యూఢిల్లీ: వాతావరణం ఎలా ఉందన్న సమాచారం తెలుసుకొని కేదార్నాథ్కు బయల్దేరాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం భక్తులకు సూచించింది. కేదార్నాథ్లో పెద్ద ఎత్తున మంచుకురుస్తున్న కారణంగా తగు జాగ్రత్తలతో భక్తులు ముందుకు కదలాలని కోరింది. ‘సోమవారం నాడూ కేదార్నాథ్లో భారీగా మంచుకురిసింది.
కేదార్నాథ్కు వస్తున్న భక్తులు మారిన వాతావరణ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలి’ అని రుద్రప్రయాగ్ ఎస్పీ విశాఖ అశోక్ బదానే చెప్పారు. ఆన్లైన్ కొత్త రిజిస్ట్రేషన్లను మే 15 వరకు నిలిపివేస్తున్నామని టూరిజం జేడీ యోగేంద్ర గంగ్వార్ చెప్పారు. ఎడతెగకుండా కురుస్తున్న మంచు కారణంగా హేమకుంద్ సాహిబ్ వెళ్లే మార్గం మూసుకుపోయింది.