Modi @ UNO | ప్రపంచ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లను తయారు చేసేందుకు భారత్కు రావాలని ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ ఫార్మా సంస్థలను ఆహ్వానించారు. శనివారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ఇతర దేశాల్లో అవసరమైన ప్రజలకు వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇందుకోసం గ్లోబల్ ఔషధ తయారీ సంస్థలు వచ్చి.. భారత్లో వ్యాక్సిన్లు తయారు చేయాలని పిలుపునిచ్చారు.
వందేండ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారితో గత 18 నెలలుగా మోత్తం ప్రపంచం ఇబ్బందులు పడుతోంది. ప్రాణాంతక మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తున్నా.. వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా అని మోదీ చెప్పారు. ప్రస్తుతం భారత్లో వ్యాక్సిన్ డెలివరీ ప్లాట్ఫామ్ కోవిన్ ఒక్క రోజులో లక్షల మందికి వ్యాక్సినేషన్లో డిజిటల్ సపోర్ట్ అందిస్తున్నదని చెప్పారు.