చెన్నై: తమిళనాడుకు చెందిన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ సీ విజయ్కుమార్ ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. తన గన్మెన్కు చెందిన పిస్తోల్తో అతను పేల్చుకున్నాడు. కోయంబత్తూరులోని క్యాంపు ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం విజయ్కుమార్ జాగింగ్కు వెళ్లాడు. రేస్ కోర్సులో ఉన్న క్యాంపు ఆఫీసుకు వచ్చిన తర్వాత ఉదయం 6.50 నిమిషాలకు అతను తనను తానే కాల్చుకున్నాడు. అయితే ఎందు వల్ల అతను ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఇంకా తెలియలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
డీఐజీ విజయ్కుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పిటల్కు తీసుకువెళ్లారు. కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆఫీసర్గా జనవరి 6వ తేదీన విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అన్నానగర్ డీసీపీగా చేశారు. డీఐజీ విజయ్కుమార్ మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ షాక్ వ్యక్తం చేశారు. డీఐజీ మృతి రాష్ట్ర పోలీసు శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్లు ఆయన తెలిపారు. డీఐజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.