న్యూఢిల్లీ: త్వరలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజంట్ సీఈవో రవి కుమార్ తెలిపారు. దీంతో పాటు 110 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను కూడా తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పలు కాగ్నిజెంట్ కార్యాలయాలు మూతపడే అవకాశం ఉన్నది.
కాగ్నిజెంట్ అమెరికాకు చెందిన సంస్థ అయినా భారత్ కేంద్రంగా ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో భారతీయ ఉద్యోగులపై లేఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కాగా, ఇటీవలే కాగ్నిజెంట్ సంస్థ బ్రియన్ హంఫ్రీస్ను సీఈవోగా తొలగించి రవి కుమార్ను నియమించింది.