ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల విలువైన 980 గ్రాముల కొకైన్ను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. లోదుస్తులో దాచి డ్రగ్స్ను తరలిస్తుండగా.. పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.